Vaccine: కరోనా మానవాళి గతిని ఎలా మర్చి వేసిందో తెలియంది కాదు. అది ఇప్పటికీ, ఎప్పటికీ కోలుకోలేని దెబ్బే అని చెప్పుకోవాలి. ఇకపోతే దాదాపుగా మన భారత్ లో పెద్దవాళ్ళకి కరోనా వ్యాక్సినేషన్ జరిగిందనే చెప్పుకోవాలి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా వ్యాక్సినేషన్ విజయవంతంగా మన ప్రభుత్వాలు పూర్తి చేసాయి. ఇక మిగిలింది చిన్నపిల్లలు. కరోనా వైరస్పై పోరులో భాగంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త వేరియంట్ల ఆందోళన నేపథ్యంలో 15 ఏళ్లు దాటిన పిల్లలకు టీకాకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!
ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఇలా అన్నారు..
తాజాగా జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన సంగతి మనకు తెలిసినదే. ఈ సందర్భంగా అయన పిల్లల వాక్సినేషన్ గురించి మాట్లాడారు. అవును.. జనవరి 3 తరువాత 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. పిల్లలకు టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొ-విన్ యాప్ ద్వారా జనవరి 1 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
AP High Court: అమరావతి రాజధాని కేసుల విచారణ జనవరి 28కి వాయిదా..
ఇలా నమోదు చేసుకోవాలి..
కొ-విన్ యాప్ చీఫ్ డాక్టర్ అయినటువంటి RS శర్మ మాట్లాడుతూ.. కొంతమందికి ఆధార్ కార్డ్లు లేకపోవచ్చు కనుక సదరు విద్యార్థుల ఐడీ కార్డ్ల సాయంతో COWIN పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. పిల్లలు పేరు నమోదు చేసుకున్నప్పుడు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని అడుగుతుంది.. అవును అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత వ్యాక్సినేషన్ కేంద్రంలో రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత టీకా తీసుకోవచ్చు అని వెల్లడించారు.