సీనియర్ నటుడు తొట్టెంపూడి వేణు ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తరువాత చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. వేణు హీరోగా మాత్రమే కాదు కమెడియన్గానూ ప్రేక్షకులను బాగా అలరించాడు. కానీ గత 9 ఏళ్లుగా సినిమాకి దూరంగా వున్నాడు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఒక డైరెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
Venu: వేణు రాకతో ఆ కాలం నాటి ప్రేక్షకుల ఖుషి
వేణు రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ ద్వారా ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీలో వేణు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కేకపుట్టించడం ఉన్నాడు. వేణు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ సందర్బంగా వేణు సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆ విషయంలో బతిమిలాడిన డైరెక్టర్
వేణు ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నా మొదటి ప్రాధాన్యత సినిమాలకే ఉంటుంది. కానీ కొన్ని కారణాలతో నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. లాక్డౌన్ సమయంలో ఫ్రీ టైమ్ దొరకడంతో నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాను. అలానే ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూడటం ప్రారంభించాను. కొందరి నటన చూసి అసూయ పడ్డాను. ఈ రోజుల్లో ఇంత మంచి కంటెంట్ వస్తుందా? అని ఆశ్చర్యపోయాను. ఈ సమయంలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ శరత్ మండవ చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగాడు కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో మీరు సినిమాలో నటించకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి కలుద్దాం, ప్లీజ్ అని డైరెక్టర్ మెసేజ్ చేశారు.”
“ఆయనలా బతిమిలాడుతుంటే కాదనలేక కలిశాను. అప్పుడు మూవీలో నా కోసమే ఒక క్యారెక్టర్ రాసుకున్నట్లు చెప్పారు. ఈ క్యారెక్టర్ను ఎలా డిజైన్ చేశారో చెప్పారు. ఆ రోల్ నాక్కూడా నచ్చడంతో ఓకే చెప్పానని వివరించారు.