వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ కి అతి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చుట్టూ భూవివాదాలు మూగుతున్నాయి.
ముఖ్యంగా భూదందా ఆరోపణలతో విజయసాయిరెడ్డి సతమతమవుతున్నారు.భూ కబ్జా ఆరోపణ లతో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ నాయకుడు కొయ్య ప్రసాద్రెడ్డి వ్యవహారంలో విజయసాయి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రసాద్ రెడ్డిని తదుపరి పోలీసులు అరెస్టుచేయడం కూడా జరిగింది .విషయాని కొసే …త్వరలో విశాఖ రాజధాని కానుండడంతో అక్కడ భూములకు విలువ పెరిగింది అదే సమయంలో భూకబ్జాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి భూకబ్జా జరిగినప్పుడల్లా విజయసాయిరెడ్డి పేరు మారుమోగుతోంది . ఇక విజయసాయిరెడ్డి ఈ పరిణామాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నా ఆయన పేరు వాడేసుకుంటూనే ఉన్నారు.
ఈ మధ్యనే విశాఖ నడిబొడ్డున ఒక అతి విలువైన స్థలం కబ్జా చేసేందుకు ఓ ముఠా ప్రయత్నం చేసింది. వారు సిటీలో అర్ధరాత్రి నుంచి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, స్థానికులకు హెచ్చరికలు జారీ చేస్తూ తమ వెనక ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెప్పుకోవడం విశేషం. దీని మీద వెంటనే రియాక్ట్ అయిన విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన పేరు ఎవరు చెప్పినా ఊచలు లెక్కించాలని కూడా గట్టిగానే కోరారు. ఇక విజయసాయిరెడ్డి ఆఫీస్ లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి కూడా ఆయన పేరు ఉపయోగించుకుని అవినీతికి పాల్పడడం విశేషం.
ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో ఎంపీ నుంచి లేఖను వచ్చేలా చూస్తానని ఆమె సంబంధిత పార్టీతో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేసిన వైనం బయటకు పొక్కడంతో సాయిరెడ్డి మరింత ఇరకాటంలో పడ్డారు. దీంతో ఆయన తన పేరుతో భూకబ్జాలు చేస్తే ఎవరినైనా సరే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించాల్సి వచ్చింది .అయినా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు.రోజుకో భూకబ్జా విశాఖపట్నం లో జరుగుతోంది.విజయసాయిరెడ్డి తనకేం సంబంధం లేదని ఎంత మొత్తుకున్నా ప్రతిపక్షాలు ఆయనపైనే బురద జలుతున్నాయి.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు దొంగే దొంగని అరచినట్లుగా ఉందని విజయసాయిరెడ్డి మీద సెటైర్లు వేశారు.
విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే విశాఖలో భూ దందాలు జరుగుతున్నాయని, కానీ ఆయన ఏమీ తెలియనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతా ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖకు అడ్డ పంచెల వాళ్ళు వచ్చి కబ్జా చేస్తారని తాము ముంచు నుంచి చెబుతున్నామని, అదే ఇపుడు జరుగుతోందని కూడా మాజీ మంత్రి అంటున్నారు. మొత్తంమీద విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి అంత కంఫర్టబుల్గా లేరనే చెప్పాలి