Pawan Kalyan: నిన్న హైదరాబాద్ జలవిహార్ లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో “అలయ్ బలయ్” కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చాలామంది రాజకీయ దిగ్గజాలు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే రీతిలో “మా” అసోసియేషన్ కొత్త అధ్యక్షులు మంచు విష్ణు పాల్గొన్నారు. ఈ క్రమంలో విష్ణు పవన్ కళ్యాణ్ పక్క పక్కనే కూర్చున్నా కానీ ఇద్దరూ మీడియా కెమెరాల ముందు మాట్లాడుకున్న సందర్భాలు ఎక్కడా కనబడలేదు. ఇటువంటి తరుణంలో ఆదివారం మీడియా ఛానల్స్ లో మంచు విష్ణు తో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని రకరకాల వార్తలు కుప్పలుతెప్పలుగా.. ప్రచారం చేస్తే కథనాలు ప్రసారం చేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో తాజాగా మంచు విష్ణు తిరుపతిలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో “అలయ్ బలయ్” కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తాను చాలా సేపు మాట్లాడుకోవటం జరిగిందని… ఇండస్ట్రీని ఒక తల్లి మాదిరిగా జాగ్రత్తగా చూసుకో విష్ణు అని పవన్ తనకు చెప్పారని స్పష్టం చేశారు. చిరంజీవి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పటినుండో స్నేహ పూర్వకంగా కలిసి మెలిసి ఉండడం స్టేజిపై వెళ్లకముందు కింద చాలాసేపు పవన్ కళ్యాణ్ తో తాను మాట్లాడినట్లు విష్ణు చెప్పుకొచ్చారు. స్టేజ్ పైన ఉపరాష్ట్రపతి ఉన్న నేపథ్యంలో గౌరవం ఇస్తూ ఏం మాట్లాడలేదని దాన్ని మీడియా చూపించి వార్తలు ప్రచారం చేసినట్లు విష్ణు మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా…
అంత మాత్రమే కాక తెలుగు వాళ్ళు మాత్రమేనా అధ్యక్షుడిగా పోటీ చేయాలని.. తాము ఎక్కడ ప్రకటించలేదని ఎన్నికలు అయిపోయిన అనంతరం చిరంజీవి- మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు అని స్పష్టం చేశారు. జర్నలిజన్నీ ఒక భ్రష్టు పట్టించిన ఒక జర్నలిస్ట్ డబ్బింగ్ సినిమాల్లో నటించి “మా” సభ్యత్వాన్ని పొంది.. ఇండస్ట్రీలో ఇటువంటి వివాదాలు సృష్టిస్తున్నాడు అని మంచు విష్ణు మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు.. మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు చేసిన రాజీనామా తనవద్దకు ఇంకా చేరలేదని చేరిన తర్వాత స్పందిస్తానని తాజా మీడియా సమావేశంలో మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.