BREAKING: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ అయిన ఫేస్ బుక్ యూజర్స్ ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు. ప్రతీ ఒక్కరు దాదాపుగా ఫేస్ బుక్ అకౌంట్ కలిగి ఉన్నారడనంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఫేస్ బుక్ యూజర్స్కు ఓ చేదు వార్త అంటూ ఓ కథనం ప్రచురితం కాగా దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఫేస్ బుక్ ప్రజెంట్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రిజైన్ చేసేందుకు సిద్ధమయ్యాడనే వార్త హల్ చల్ చేస్తోంది.
Facebook: ఫేస్ బుక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్..
యూజర్స్ డేటా లీకేజీ నేపథ్యంలోనే రాజీనామా..!
ఫేస్ బుక్ సంస్థ తమ వినియోగదారుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డేటా లీక్ చేసిందనే ఆరోపణలు గతంలో వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇటీవల కూడా ఇటువంటి ఆరోపణలు ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఒకరు చేశారు. ఈ నేపథ్యంలో బోర్డులోని మెజారిటీ సభ్యులు వద్దని చెప్పినప్పటికీ ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ రాజీనామాకు సిద్ధమయ్యారని బ్రిటన్కు చెందిన ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో మార్క్ రాజీనామాకు డేటా లీకేజీ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Facebook : ఫేస్బుక్ యూజర్లకు షాకింగ్ న్యూస్…!
భద్రత కాదు.. లాభాలే పరమావధి..!
ఫేస్ బుక్ సంస్థ, ఇన్ స్టా గ్రామ్ వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతుందని అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెస్ హౌగెన్. అయితే, ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజాలు లేవని, అవి కేవలం ఆరోపణలేనని ఫేస్ బుక్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. అయితే, ఫేస్ బుక్ సంస్థలో యూజర్స్ సెక్యురిటీ కంటే కూడా ప్రాఫిట్స్ ముఖ్యమన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా గత కొంత కాలం నుంచి పలువురు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సంస్కరణల దిశగా అడుగులు పడాలంటే ఫేస్ బుక్ సీఈవో పదవి నుంచి మార్క్ తొలగించబడాలనే పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మార్క్ తన సీఈవో పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కథనాలు రావడం ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల 10న ‘క్విట్ ఫేస్ బుక్’ పేరిట క్యాంపెయిన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది సక్సెస్ అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
MAA Electon’s: భారీ బందోబస్తు మధ్య “మా” ఎన్నికలు..!!