సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఈ నేపథ్యంలో వచ్చిన ఓట్లు ఆధారంగా ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో కుమార్ సాయి హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. చివరి దాకా కుమార్ సాయి మోనాల్ పేర్లు ఉండగా…చివరాకరికి కుమార్ సాయిని స్టేజి మీదికి యాంకర్ నాగార్జున పిలవడం జరిగింది.
దీంతో ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ కుమార్ సాయి…నీ ఏంటి సభ్యులపై మీ అభిప్రాయం కూరగాయలతో పోల్చలాని నాగార్జున చెప్పటంతో ఒక్కొక్కరికీ ఒక్కో పేరు పెట్టారు. హారిక అంటే తనకు నచ్చలేదని… ఆమెకు వంకాయ తో పోల్చాడు. అభిజిత్ చాలా కూల్ గా ఉంటాడు అని కీరదోస తో పోల్చాడు. అవినాష్ అరటిపండు ఆరియనా నీ ఉల్లిపాయతో పోల్చాడు.
ఇక ఆఖరిగా అఖిల్ ని కూరలో కరివేపాకు.. అని అంటూ అతను టాస్క్ ఆడుతున్న ఫలితం రావడం లేదని కారణం చెప్పుకొచ్చాడు కుమార్ సాయి. ఈ సందర్భంలో అఖిల్ కొద్దిగా హర్ట్ అయ్యి.. నేను టాస్క్ లు ఓడిపోయినా గాని హౌస్ లో ఉన్నాను..మీరు గెలిచినా అక్కడ స్టేజి మీద ఉన్నావు అంటూ కుమార్ సాయి కి గట్టి కౌంటర్ ఇచ్చారు.