తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో అనసూయ భరద్వాజ్ పేరు తెలియని వారంటూ ఉండరు. తెలుగు రాష్ట్రాలలో ఈ భామ అంత పాపులర్ మరి. తెలుగు బుల్లి తెరపై ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఒకపక్కన యాంకరింగ్ చేస్తూనే మరొపక్కన తగిన మోతాదుల్లో అందాలు ఆరబోస్తూ సూపర్ పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ హాట్ యాంకర్ సినిమాల విషయానికి వస్తే, ఓ పక్క టీవీ షో ల్లో యాంకరింగ్ చేస్తూనే మరొక పక్కన సినిమాల్లో నటిస్తూ అక్కడ కూడా మంచి పేరును సంపాదించుకుంది.
అనసూయ తరచుగా వార్తలలో నిలుస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల అనసూయ ఓ విషయం లో స్టేజి మీద బోరున ఏడ్చేసింది. ఇంతకీ అసలు ఈ హాట్ యాంకర్ ఎందుకు ఏడ్చింది అనుకుంటున్నారా? ఈటీవీ ఛానల్ లో ప్రతి పండగకి అందులో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లోని వారందరు కలిసి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతికి కూడా ఈ టీవీ యాజమాన్యం భారీగా ఓ ప్రోగ్రామ్ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈటీవీలో అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
ఈ ప్రోగ్రాంలో ప్రముఖ సింగర్ మధు ప్రియ పాడిన పాట కారణం గా సెట్ లో ఉన్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మధు ప్రియ పాడిన పాటలో ప్రస్తుత సమాజం లో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అలాగే వారికి జరుగుతున్న ఘటన లను ఉద్దేశిస్తూ పాడిన పాట. ముఖ్యంగా ఆ పాట విన్న యాంకర్ అనసూయ అయితే స్టేజి మీదే ఏడ్చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!