హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టుల పేరుతో ప్రయాణికుల వద్ద సిబ్బంది నిలువుదోపిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో విదేశాల నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుల నుండి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీపీసీఆర్ పరీక్షకు 750 రూపాయలు కు బదులు నాలుగు వేల రూపాయలు అక్కడ వైద్య సిబ్బంది వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పట్టించుకోకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు విచ్చలవిడిగా ప్రయాణికుల వద్దనుండి డబ్బులు దండుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ ఈ సిబ్బంది కరోనా టెస్ట్ పేరుతో కొల్లగొడుతున్నట్లు తాజాగా ఈ నిలువుదోపిడి బయటపడింది.
ఈ క్రమంలో ఇదేంటి అని ప్రశ్నించిన ప్రయాణికులపై దురుసుగా ఎయిర్ పోర్టు అధికారులు వ్యవహరిస్తున్నరట. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంపై ప్రయాణికులు సీరియస్ అవుతున్నారు. ఎయిర్ పోర్టు అనగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో సరైన విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధికారులే మీరడం పట్ల విదేశీయులు సైతం కరోనా టెస్ట్ ధరల విషయంలో అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.