ఆది పురుష్.. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా నటించబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించనున్నారు. అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. దాదాపు 750 కోట్ల కి పైగానే బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే సీత పాత్రలో ఏ స్టార్ హీరోయిన్ కనిపంచబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఒక్క సీత పాత్ర తో పాటు ప్రధాన పాత్రలు అయిన లక్ష్మణ, హనుమ రోల్స్ కు సంబంధించి అప్డేట్స్ కూడా ఈ నెల ప్రభాస్ పుట్టినరోజున రివీల్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ ఆ అప్డేట్స్ ఏవీ వెల్లడించలేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీత గా నటించబోతున్న హీరోయిన్ ని రివీల్ చేయమని డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇక ముందు నుంచి ఈ సినిమాలో సీతగా నటించబోయే హీరోయిన్ విషయంలో కీర్తి సురేష్.. పూజా హెగ్డే.. కియారా అద్వానీ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే ఇప్పటికే బాలీవుడ్ లో ఒక పీరియాడికల్ మూవీ చేసింది కాబట్టి పూజా కి ఆ అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ప్రభాస్ తో రాధే శ్యామ్ కూడా చేస్తుండగా ఆది పురుష్ లోనూ పూజా హెగ్డే సీతగా కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కియారా అద్వానీ నే ఆదిపురుష్ లో సీతగా ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి ప్రభాస్ డిమాండ్ మేరకు ఆది పురుష్ టీమ్ త్వరలో సీత గా నటించే హీరోయిన్స్ రివీల్ చేస్తే బావుంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!