స్వీటి అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా నిశ్శబ్ధం. మాధవన్, శాలినీ పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని హేమంత్ మధుకర్ తెరకెక్కించాడు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసే విధంగా మేకర్స్ రెడీ చేశారు. కాగా ఈ సినిమా గత మే లోనే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ తో థియోటర్స్ మూతపడి రిలీజ్ కి బ్రేక్ పడింది. అయితే ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు అనుష్క నిశ్శబ్ధం ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోతో డీల్ కుదిరిందని తాజా సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సామాచారం. అమెరికా నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని…అక్టోబర్ 10 లేదా అక్టోబర్ 17 న నేరుగా ఓటీటీలో రిలీ అవుతుందని అంటున్నారు. త్వరలో నిశ్శబ్ధం సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేయనున్నారట.
ఇక అనుష్క కూడా ఈ సినిమా రిజల్ట్ మీదే తన నెక్స్ట్ సినిమా ఆధారపడి ఉందని తెలుస్తుంది. ఒక తమిళ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కి మేకర్స్ సంప్రదించినట్టు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత కోన వెంకట్ నిర్మాణంలో కరణం మల్లీశ్వరి బయోపిక్ రూపొందనుంది. సంజనా రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుంది. ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ కాగా మరో సినిమా కూడా త్వరలో ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!