NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కందుకూరు ఘటనకు వైసీపీ నేతల కామెంట్స్ ఇలా..బాబుపై విమర్శనాస్త్రాలు

కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డు షో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనలో 8 మంది కార్యకర్తలు మృతి చెందడం, మరి కొందరు కార్యకర్తలు గాయపడటంతో అధికార వైసీపీ విమర్శలకు దిగింది. చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ఘటన జరిగిందని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. స్థానికులు చంద్రబాబు రోడ్ షో కు రాకపోవడంతో చంద్రబాబు తనతో జనాలను తీసుకువచ్చారని విమర్శించారు. ఎనిమిది మంది అమాయకులు మరణానికి చంద్రబాబే కారణమనీ, కావాలనే ఇరుకు రోడ్లలో రోడ్ షో నిర్వహించారని కాకాని మండిపడ్డారు.

Kakani Govardhan Reddy

 

పేదల ప్రాణాలకు చంద్రబాబు వెల కడుతున్నారని కాకాని విమర్శించారు. డ్రోన్ షాట్ ల కోసం 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం వల్లే కందుకూరు ఘటన జరిగిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని బాబుతో ఇదేమి ఖర్మ అని జనం అనుకుంటున్నారని మంత్రి కాకాని విమర్శలు గుప్పించారు. జగన్ సభలకు ఎంత మంది వచ్చినా ఎక్కడా ఒక అపస్తృతి జరగలేదని అన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ 29 మంది మృతికి కారణమయ్యారని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రచార ఆర్భాటంతో రోడ్డుపై ఫ్లెక్సీలు పెట్టారనీ, టీడీపీ నేతల నిర్వాకం వల్లనే 8 మంది అమాయకలు బలి అయ్యారని కందుకూరు ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టి ప్రమాదానికి కారణమయ్యారని అన్నారు. చేసింది తప్పని తెలుసుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తే జనం బుద్ది చెబుతారని ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి హెచ్చరించారు. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది చనిపోయారని పేర్కొన్నారు. తక్కువ జనాలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

ఇరుకు సందులో సభ పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని అన్నారు బాలినేని. చంద్రబాబు అధికార వ్యామోహాన్ని తగ్గించుకుంటే మంచిదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హితవు పలికారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబుకు అసలు విజనే లేదని అన్నారు. పుష్కరాల్లోనూ పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారని గుర్తు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కందుకూరు ఘటన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N