ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న గూగుల్ పే, ఫోన్ పేలాగే ఎస్బీఐకి చెందిన యోనో లైట్ యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో యూపీఐ ద్వారా బిల్లు చెల్లింపులు, నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే ఒక్క ట్రాన్సాక్షన్కు రూ.10వేల లిమిట్ ఉంటుంది. అలాగే రోజుకు రూ.25వేల వరకు ట్రాన్సాక్షన్కు మాత్రమే అనుమతిస్తారు. ఈ క్రమంలో ఎస్బీఐ యోనో లైట్ యాప్ కస్టమర్లకు ఎంతో ఉపయోగంగా మారింది.
అయితే ఎస్బీఐ యోనో లైట్ యాప్లో యూపీఐ ద్వారా పంపిన నగదు అవతలి వారికి వెళ్లక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే వెంటనే వినియోగదారుడికి నగదు వెనక్కి వస్తుంది. లేదా కొన్నిసార్లు అవతలి వారికి చేరుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిగ్గా జరుగుతుంది. అందుకు యూజర్లు ఏమీ చేయాల్సిన పనిలేదు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా డబ్బు రిటర్న్ అవకపోతే అప్పుడు యూజర్లు ఇలా చేయవచ్చు.
యోనో లైట్ యాప్లోని యూపీఐ అనే విభాగంలో ఉండే యూపీఐ పేమెంట్ హిస్టరీలోకి వెళ్లి అందులో ఫెయిలైన ట్రాన్సాక్షన్ను ఎంచుకోవాలి. అక్కడ వచ్చే రైజ్ డిస్ప్యూట్ను ఎంచుకోవాలి. దీంతో ఎస్బీఐ టీఎం మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది. ఈ క్రమంలో ఫెయిలైన ట్రాన్సాక్షన్లో ఇరుక్కున్న డబ్బు మీకు వెనక్కి వస్తుంది. ఈ ప్రక్రియనంతా యూజర్లు రియల్టైంలో చెక్ చేసుకోవచ్చు. డిస్ప్యూట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. దీంతో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా వెంటనే డబ్బును వెనక్కి పొందేందుకు అవకాశం ఉంటుంది.