వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ 3 రాజధానుల కాన్సెప్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. రాష్ట్రం లో అభివృద్ధి ఒక చోట మాత్రమే జరగకూడదని అంతటా జరగాలని వైయస్ జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చి అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ రాకముందు వరకు ఏపీ రాజకీయాలు మొత్తం ఏపీ రాజధాని టాపిక్ చుట్టే తిరిగేవి. ఒక అమరావతి ప్రాంతంలో ఓ సామాజిక వర్గానికి చెందినవారు తప్ప, చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అద్భుతమైన నిర్ణయమని ఓకే చేయడం, సానుకూలంగా తమ అభిప్రాయం తెలియజేయడం జరిగింది.
అయితే ఆ తర్వాత కరోనా విజృంభణ జరగటంతో ఈ విషయం సైలెంట్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో తాజాగా 3 రాజధానుల ప్రతిపాదన చేసి 7 నెలలు కాబోతున్న తరుణంలో…ఇక ఆలస్యం చేయకూడదు అని వెంటనే జగన్ డిసైడ్ అయ్యారట. ఒకపక్క ఈ వ్యవహారం న్యాయ స్థానంలో మరొక పక్క శాసనమండలిలో ఉన్నాగాని…తాజా పరిణామాలను బట్టి రాబోయే నెల రోజుల్లో రాజధాని తరలింపునకు మార్గం సుగమమయినట్లేనని అధికార వైసీపీ భావిస్తుంది. రెండోసారి శాసనమండలికి బిల్లులను పంపినప్పుడు వాటిని ఆమోదించినా, లేకున్నా నెల రోజుల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనన్నది అధికార పార్టీ వాదన.
దీంతో జూలై 17 నాటికి రాజధానుల విభజన బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతాయన్నది వైసీపీ నేతలు అంటున్న టాక్. ఇదే తరుణంలో నెక్స్ట్ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ లోపు ప్రయోగాత్మకంగా ఉద్యోగస్తులను ముందు తరలిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఆగస్టు నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశం ఉండటంతో ఈ అతిపెద్ద ప్రయోగం చేయడానికి జగన్ సర్కార్ రెడీ అయినట్లు…ఉద్యోగస్తులు కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ సర్కార్ చేస్తున్న ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే జాతీయ స్థాయిలో ఉన్న నేతలు సెల్యూట్ కొట్టడం గ్యారెంటీ అని ఆంటున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా రాజధాని తరలింపు సజావుగా సాగితే మూడు ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా వైఎస్ జగన్ సర్కార్ కి సెల్యూట్ లు కొట్టేయడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.