Ys Jagan Mohan Reddy : ప్రస్తుతం దేశంలో రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చాలా మంది రైతులు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినటం మాత్రమే కాక అనేక కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం సంతోషంగా ఫీలయ్యే నిర్ణయం ఏపీ రైతుల విషయంలో సీఎం జగన్ తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పై సమీక్ష అధికారులతో నిర్వహించారు సీఎం జగన్ . ఈ సందర్భంగా దేశ కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులో ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అదేవిధంగా అన్ని దిశ పోలీస్ స్టేషన్ లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు కూడా దిశ చట్టం, దిశా యాప్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. అదే రైతు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ రక్షణగా ఉండే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిశా పోలీస్ స్టేషన్ మాదిరిగా జిల్లాకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ రైతులకు ఉండాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు న్యాయం చేయడం కోసం వ్యవస్థ ఏర్పాటు కావల్సిన అసరముందన్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని సమస్యలతోపాటు న్యాయపరమైన చిక్కులు కూడా త్వరగా పరిష్కరించే రీతిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఉండాలని జగన్ తెలిపారు. అంతమాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్ లో దిశ హెల్ప్ డెస్క్ మాదిరిగా రైతులకు కూడా హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ సూచించినట్లు సమాచారం. దీంతో ఏపీ రైతాంగం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ మీడియాలో రావటంతో దేశవ్యాప్తంగా ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.