అమరావతి : ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఏపి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది లక్ష్మీ నారాయణ పిల్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, మీడియాలోనూ కోర్టు తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం 49 మందికి నోటీసులు జారీ చేసింది. వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.