విజయవాడ, ఏప్రిల్ 12: ఓటమి నెపాన్ని ఎన్నికల కమిషన్ మీద వేసేందుకే చంద్రబాబు ఈవిఎంలు పని చేయలేదంటూ ప్రచారం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో పరాజయం పాలవుతున్న విషయం చంద్రబాబుకు అర్థమయిందని జివిఎల్ పేర్కొన్నారు.
ఈవిఎంలలో చిన్న చిన్న సమస్యలు సహజమనీ, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని జివిఎల్ చెప్పారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే చంద్రబాబు దారుణంగా పరాజయం పాలవుతున్నారని జివిఎల్ జోస్యం చెప్పారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందని జివిఎల్ అన్నారు. టిడిపికి ఓటు వేస్తే వైసిపికి వెళ్తుతోందన్న చంద్రబాబు ఆరోపణలు ఆయన ఓటమిని తెలియజేస్తున్నాయని జివిఎల్ అన్నారు.
ఎన్నికల కమిషన్ స్వతం త్ర సంస్థ అనీ, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని జివిఎల్ పేర్కొన్నారు. ప్రధాని మోది మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోది బయోపిక్ విడుదలను ఎందుకు బ్రెక్ వేస్తుందని జివిఎల్ ప్రశ్నించారు.