అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనీ, పోలింగ్ నిర్వహణలో నిబంధనలకు పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చీకటి గదిలో పోలింగ్ నిర్వహించడం దారుణమని ఆయన అన్నారు. దేశంలో మొదటిసారి అర్ధరాత్రి దాటాక పోలింగ్ నిర్వహించడం బాధాకరమన్నారు. ప్రజలకు ఎన్నికల కమిషన్ క్షమాపణ చెప్పాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం టిడిపి, వైసిపి,జనసేన పార్టీలు రాహుల్కు మద్దతివ్వాలని రఘువీరా రెడ్డి సూచించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని రఘువీరా రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.