ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు పదవి చేపట్టిన తర్వాత ఎక్కడా తగ్గడం లేదు. బిజెపి పార్టీలో ఉంటూ వేరే పార్టీ నాయకులకు కోవర్టుగా పని చేస్తున్నట్టు అనుమానం వస్తే చాలు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటూ సోము వీర్రాజు బెంబేలెత్తిస్తు పార్టీలో నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీలో కొంతమంది నాయకులు సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి నెలరోజులు కాకముందే ఆయనపై ఢిల్లీ పెద్దలకు లెటర్ రాస్తూ కంప్లైంట్ చేశారు.
ఆ లెటర్లో సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా మారి నెలరోజులు కాలేదు, అప్పుడే పార్టీలో ముగ్గురిని సస్పెండ్ చేసి పారేశారు, ఏదైనా పార్టీ నేతలతో ప్రాబ్లం ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి గానీ ఈ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల పార్టీ నష్టపోతుందని ఢిల్లీ బీజేపీ పెద్దలకు లెటర్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోము వీర్రాజు సస్పెండ్ చేసిన వారిలో ఇద్దరు అన్యాయంగా సస్పెండ్ అయ్యారని పార్టీ పెద్దల దృష్టికి లెటర్ ద్వారా తీసుకువచ్చారు.
ఈ విధంగా సోము వీర్రాజు వ్యవహరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీలో ఎవరూ మిగలరని అన్నారట. పార్టీ బలోపేతం చేస్తాను అని ఇలా పార్టీలో ఉన్న నాయకులను సస్పెండ్ చేస్తే… రాబోయే రోజుల్లో బిజెపి పార్టీలో కూడా చేరడానికి ఎవరు సముఖంగా ఉండరని పేర్కొన్నారట. అంతేకాకుండా సోము వీర్రాజు సొంత ప్రాంతం రాజమండ్రిలోనే పార్టీ బలంగా లేదని.. . లేఖలో స్పష్టం చేశారట.
ఏదిఏమైనా సోము వీర్రాజు ఆవేశం తగ్గించుకుంటే అన్ని ప్రాంత నాయకులతో సఖ్యతగా ఉంటే పార్టీ బలపడుతుందని, లేకపోతే వచ్చే ఎన్నికలకు కూడా సేమ్ ఇప్పుడున్న పరిస్థితి ఎదురవడంతో గ్యారెంటీ అని ఫిర్యాదు చేశారట. దీంతో వెంటనే ఢిల్లీలో బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకుడు సోము వీర్రాజు కి రాత్రికి రాత్రి ఫోన్ చేసి ఏపీ బీజేపీ పార్టీకి సంబంధించి నివేదిక అందించాలని, పార్టీ హైకమాండ్ చెప్పేవరకు రాష్ట్ర బీజేపీ నేతల పై మీరు ఎటువంటి చర్యలు చేపట్టే కూడదని గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్.