ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందునుండి సంక్షేమ పథకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజే కులం, మతం, పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే రీతిలో తన ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేయడం అందరికీ తెలిసిందే. ప్రతి పేదవాడు జీవితాల్లో వెలుగులు నింపాలని, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను అని జగన్ మాట ఇవ్వటం జరిగింది.
అయితే తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలు న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని ప్రతి దానికి అడ్డం రావడంతో వైయస్ జగన్ ఇటీవల అధికారులతో సమావేశమైన సమయంలో అసహనం చెందారట. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు తన న్యాయవాదులతో న్యాయస్థానాలలో ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుపడటం పట్ల జగన్.. చాలా అసహనం చెందారట.
కోర్టులను అడ్డం పెట్టుకుని విపక్షాలు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ వలన ఎక్కువగా నష్టపోతున్నది పేదవారే అని తెలిసినా సహనంగా ఉంటూ ఎలాగైనా చివరాకరికి న్యాయమే గెలుస్తుందని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారట. అంతేకాకుండా అధికారులు ఎవరూ కూడా డిమొరలైజ్ అవ్వ కూడదని కచ్చితంగా ఈ కార్యక్రమం పేదవారికి ఉపయోగపడింది కాబట్టి భగవంతుడు సహాయం చేస్తాడని చెప్పు కొచ్చారట.
ఈ రోజు కాకపోయినా ఏదో రోజు అంతిమంగా గెలిచేది న్యాయమే కాబట్టి ప్రతి ఒక్కరూ సమయమును పాటించి పక్కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, లే అవుట్ లో మొక్కలు నాటాలని… మరింత సుందరంగా తయారు చేయాలని అధికారులకు వైయస్ జగన్ ఆదేశించారు. మొత్తంమీద పేదల ఇళ్ల పట్టాల విషయంలో న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని విపక్షాలు అడ్డు పడటం పట్ల జగన్ ఒకపక్క సహనం గానే ఉంటూ మరోపక్క లోలోపల అసహనం చెందుతున్నట్లు అర్థమవుతోంది.