ముంబాయి : సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఝలక్ ఇచ్చాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు.
కొద్ది రోజుల క్రితమే రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్ కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. సుజయ్ అహమ్మద్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలోనే రాధాకృష్ణ కూడా బిజెపిలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్లో కొనసాగుతున్నప్పటికీ కుమారుడు సుజయ్ విభే పాటిల్కు బహిరంగంగా మద్దతు పలికారు. రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. శుక్రవారం మహరాష్ట్రలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.