అమరావతి, జనవరి 16: భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు చేపట్టింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో బిజెపిని ప్రజలకు మరింతగా చేరువయ్యేలా మేనిఫెస్టోను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి చైర్ పర్సన్గా, మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కన్వీనర్గా వ్యవహరిస్తారు.
వీరితోపాటుగా పి విజయ్బాబు, పీవీఎస్ మాధవ్, దాసరి శ్రీనివాసులు, షేక్ మస్తాన్, పాక సత్యనారాయణ, కె కపిలేశ్వరయ్య, పి సన్యాసి రాజు, సుధీష్ రాంభొట్ల, డిఎఆర్ సుబ్రహ్మణ్యంలను ఆయన నియమించారు.
previous post
next post