NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షనీయమే – జగన్

హైదరాబాదు, జనవరి 16: కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, హక్కులు కాపాడుకోవాలంటే   సంఖ్యాపరంగా (ఎంపి) పెరగాల్సిన అవసరం ఉందని ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.  తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బృందం బుధవారం మధ్యాహ్నం లోటస్ పాండ్‌లో జగన్మోహనరెడ్డిని కలిసి ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలను, రాష్ట్రాలకు కేంద్రం నుండి జరుగుతున్న అన్యాయాలను, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళితే రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉంటాయి తదితర విషయాలపై చర్చించారు. అనంతరం కెటిఆర్, జగన్‌లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు  తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు.  రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా పరంగా పెరగాలి. ఆంధ్రప్రదేశ్ ఎంపిలు 25మందికి తోడు తెలంగాణా ఎంపీలు 17మంది మొత్తం 42మంది పార్లమెంట్‌లో ఒక్కటిగా మాట్లాడితే ఏమైనా సాధించుకోవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఒక ప్లాట్ ఫాం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని జగన్ చెప్పారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. పార్లమెంట్ సాక్షిగా గత ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకే దిక్కు దివానా లేకుండా పోయిందన్నారు. సంఖ్యాపరంగా మన వద్ద బలం లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతొందని జగన్ అన్నారు.

ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్‌ ద్వారా మాట్లాడారనీ, ఆయన సూచనల మేరకు కెటిఆర్ బృందంతో చర్చించామన్నారు.  కెసిఆర్, కెటిఆర్ చెప్పిన వషయాలపై పార్టీలో విస్తృతంగా చర్చించి ముందుకు సాగుతామని జగన్ తెలిపారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు సంవత్సరన్నర కాలంగా ఫెడరల్ ఫ్రంట్ సమాఖ్య స్పూర్తి ఆరంభించారని కెటిఆర్ అన్నారు. ఫ్రంట్ బలోపేతంలో భాగంగా  కెసిఆర్ ఇప్పటికే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమారస్వామి, అజిత్ జోగి తదితర పార్టీ నేతలతో కలిసి చర్చించారని, ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని కోరారని కెటిఆర్ అన్నారు.

వైకాపా అధినేత, ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌తో ప్రధమ చర్చలు జరిగాయని, త్వరలో కెసిఆర్ ఎపికి వెళ్లి మరో మారు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారని చెప్పారు.

ఫెడరల్ ఫ్రంట్‌లో వైసిపి కలిసినట్లేనా అని ప్రశ్నించగా అన్ని ఇప్పుడే చెబితే మీరు అడగడానికి ఏమి ఉండదు, తరువాత మేము చెప్పడానికి ఏమి ఉండదు అని కెటిఆర్ చమత్కరించారు.

ప్రత్యేక హోదాపై మా వైఖరి గతంలోనే చెప్పాం – కెటిఆర్

ప్రత్యేక హోదాపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను మీడియా ప్రశ్నించగా ఈ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ గతంలోనే అభిప్రాయాన్ని చెప్పారని, హోదా అంశంపై రాజ్యసభలో తమ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌సభలో  తమ ఎంపి కవిత  మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.   అప్పటి ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టాలని కోరారని కెటిఆర్ చెప్పారు.

ఈ సమావేశంలో టిఆర్ఎస్ నేతలు వినోద్, సంతోష్,  పల్లా రాజేశ్వరరెడ్డి,  శ్రావన్‌కుమార్ రెడ్డ, వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Leave a Comment