కరోనా వైరస్ ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీపై ముందు నుండి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మహమ్మారిని కంట్రోల్ చేయడం విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ బిజెపి నేత ధర్మపురి అరవింద్ తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన పురపాలక మంత్రి కేటీఆర్ మాయ మాటలు చెప్పడం లో తండ్రి కేసీఆర్ ని మించి పోయాడు అంటూ….అబద్దాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా విమర్శలు గుప్పించారు.
మంత్రి కేటీఆర్ చిల్లర రాజకీయాలు మానుకుంటే బెటర్ అని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్ కంట్రోల్ చేయడం కోసం కేంద్రం రెండు వందల కోట్లు మాత్రమే నిధులు ఇచ్చినట్లు ట్విట్టర్లో కేటీఆర్ చేసిన కామెంట్లలో వాస్తవం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి ఏడు వేల కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం అని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేయడంలో కేటీఆర్ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ని మించిపోయారని విమర్శించారు. ఈ విధంగా మాయ మాటలు చెబుతూ కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బీజేపీ నేత తండ్రి కొడుకుల కి అదిరిపోయే రీతిలో నిధుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులతో మీడియా సమావేశం పెట్టించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం ఏడు వేల కోట్ల లెక్క కేంద్ర బిజెపి నాయకులతో చెబితే…. సరిగ్గా లోకల్ ఎలక్షన్ల ముందు మీడియా సమావేశం పెడితే కచ్చితంగా తండ్రికొడుకులకి ఎలక్షన్లలో ఎఫెక్ట్ గట్టిగా పడే అవకాశం ఉందని ధర్మపురి అరవింద్ సరికొత్త ప్లాన్ వేసినట్లు టాక్ వస్తోంది.