Lock Down: దేశంలో సగానికి పైగా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో బయట పడుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో దేశంలో 70 శాతానికిపైగా పాజిటివ్ కేసులు శాతం పెరిగిపోవడంతో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలో వైరస్ విజృంభణ భారీ స్థాయిలో ఉండటంతో.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ వీకెండ్ టైం లో లాక్ డౌన్ అమలు చేస్తూ ఉంది. ఇదే తరహాలో గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా మహారాష్ట్ర మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ అమలు చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారం లేదా వచ్చే వారంలో గానీ దీనికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సీఎం ఎడ్యూరప్ప ఇప్పటికే అధికారులతో మంతనాలు జరిపినట్లు కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 17న బెళగావి లోక్సభ, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల పోలింగ్ ముగియగానే.. లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. దాదాపు పది రోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసే విధంగా కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.