రాజకీయాలలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ గంటా శ్రీనివాసరావు ఇస్తారని ఆయన గురించి తెలిసిన వారు చాలామంది చెబుతారు. ఆయన అధికార దాహం వల్లే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన “ప్రజారాజ్యం పార్టీ” కాంగ్రెస్ లో కలపాల్సిన పరిస్థితి నెలకొంది అని, అందువల్లే “జనసేన పార్టీ” అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… గంట శ్రీనివాస్ పేరు చెబితే మండిపడతారని చాలామంది చెప్పుకొస్తారు. అటువంటి గంటా శ్రీనివాసరావు సరిగ్గా 2014 ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ లోకి రావడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గంట ఎమ్మెల్యేగా గెలవడం తో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో గంట ఎమ్మెల్యేగా గెలిచిన…. జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది.
ఇలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలోకి అనేకసార్లు రావాలని గంటా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసిన విశాఖ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పార్టీ తరఫున చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అడ్డుకున్నట్లు మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల జగన్ చుట్టూ ఉండే మనుషులతో డీల్ సెట్ చేసుకుని మరికొద్ది రోజుల్లో వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి గంటా శ్రీనివాసరావు రెడీ అవుతున్న తరుణంలో ఆఖరి నిమిషంలో వైకాపా లో గంట అడుగు పడకుండా సాయి రెడ్డి అడ్డుపడటం జరిగిందట. దీనిలో భాగం గానే సైకిళ్ల కుంభకోణాన్ని తెరపైకి తెచ్చినట్లు, ఏమాత్రం గంట పార్టీ లోకి రాకుండా ఉండాలి అని విజయసాయిరెడ్డి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దానికి కారణం విశాఖలో రాజధానికి సంబంధించి పనులు విషయంలో కలుగ చేసుకోవాలని గంటా శ్రీనివాస్ ఉత్సాహం చూపటమే అని సమాచారం. దీంతో ఈ విధంగా ఒక్కసారిగా విజయసాయిరెడ్డి తన అమ్ములపొదిలో మాజీ మంత్రి గంటా పై ఉన్న కుంభకోణాలు బయట పెట్టినట్లు, ఈ విషయం పార్టీలో కూడా ఎవరికీ తెలియదు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా గంట వైకాపాలో అడుగుపెట్టడం విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వైసీపీ పార్టీలో టాక్.