వైయస్ జగన్ రాజకీయాలలో మొదటిలో చాలావరకు క్లిక్ అవ్వడానికి కారణం “సానుభూతి” అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో ఓదార్పు యాత్ర అంటూ సరికొత్త స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తన తల్లితో చెల్లితో సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయడం జరిగింది. అప్పట్లో జరిగినా ఉప ఎన్నికలలో జగన్ జైలుకి వెళ్లడం తో…విజయమ్మ, షర్మిల పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని చాలావరకు సానుభూతితో గెలవడం జరిగింది. ఆ సమయంలో సీబీఐ కేసులు అంటూ జగన్ ని కాంగ్రెస్ పార్టీ వేధించడంతో ప్రజలలో జగన్ పై సానుభూతి మరింతగా పెరిగింది.
ఆ తర్వాత జగన్ జైలు నుండి బయటకి వచ్చకా తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికలలో మెల్ల మెల్లగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విభజన జరిగిన తర్వాత ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తొక్కేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాణించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నేతగా ప్రజలలో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడంలో, రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బందుల పలు చేయడంలో వైయస్ జగన్ సక్సెస్ సాధించడం జరిగింది. తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో అనగా 2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం అమరావతి రాజధాని భూముల విషయం అదేవిధంగా ఫైబర్ నెట్ విషయాలలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని సీబీఐ ఎంక్వైరీ అంటూ జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో చంద్రబాబు కూడా సీబీఐ ఎంక్వయిరీ కి ఓకే అంటే అమరావతి భూముల విషయంలో ఫైబర్ నెట్ విషయంలో అవినీతి జరగలేదు అని సిబిఐ లో ప్రూవ్ అయితే గనుక చంద్రబాబుకి రాష్ట్రంలో సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని మేధావులు అంటున్నారు. జగన్ చాలావరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పబ్లిక్ బలంగా నమ్మటం గ్యారెంటీ. ఇదే టైమ్ లో చంద్రబాబు కి మద్దతు తెలిపిన మీడియా చానల్స్ కూడా ఇదే విషయాన్ని వైరల్ చేస్తే జగన్ కి చాలా డ్యామేజ్ అవ్వడం దెబ్బతో జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారెంటీ అని మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క టిడిపి నేతలు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా వరకు సైలెంట్ అవడంతో ఈ విషయంలో వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో…. తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది.