జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి లిక్కర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలోనే పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో దశలవారీగా రాష్ట్రంలో మద్యనిషేధాన్ని అమలు చేసి సరిగ్గా 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి మందును స్టార్ హోటల్ లకు మాత్రమే పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అదే రీతిలో జగన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవటం అనంతరం గ్రామాల్లో బెల్టు షాపులు అదేవిధంగా మద్యాన్ని ప్రభుత్వమే నడిపే రీతిలో చర్యలు చేపట్టారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయాలకు మందుబాబులు నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినా కానీ ఎక్కడా తగ్గకుండా… బ్రాందీ షాప్ లో సిట్టింగ్ విధానం లేకుండా చర్యలు చేపడుతూనే ప్రస్తుతం రాణిస్తున్నారు.
దీంతో చాలామంది మందుబాబులు ఏపీ సరిహద్దు ప్రాంతాలు దాటి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చుకోవడం ఎక్కువ అవటంతో జగన్ సర్కార్ అవకాశం లేకుండా డోర్స్ క్లోజ్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. పరిమితులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని సరికొత్త ఆదేశాలు ఇచ్చింది. దీంతో మందు బాబులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. రాష్ట్రంలో మద్యం ధరలు షాక్ కొట్టే రీతిలో పెంచడంతో పాటు మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకోకూడదని… నిర్ణయం తీసుకోవటంతో మందుబాబులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు.