2014 ఎన్నికల సమయంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన కవిత తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం తెలిసిందే. ఆ సమయంలో బిజెపి గెలవడంతో ఒక్కసారి అందరూ షాక్ తిన్నారు. కేసీఆర్ కూతురు స్థానంలో బిజెపి గెలవడంతో, రాష్ట్రవ్యాప్తంగా బిజెపి బలోపేతం అవుతున్నట్లు స్పష్టమయింది. అయితే జరిగిన ఎన్నికలలో ఓటమి చెందిన కవిత మొన్నటివరకు సైలెంట్ అయిపోయారు.
కానీ తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల గురించి కవిత అన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో తన చెల్లెలు కవిత్వాన్ని గెలిపించాలని పార్టీ ప్రతినిధులని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కేటీఆర్ నిర్వహించారు. పార్టీ స్థాపించిన నాటి నుండి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉందని తెలియజేశారు. ఎంపీటీసీ లకు జడ్పిటిసి లకు ప్రత్యేక నిధుల విషయంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని త్వరలోనే పరిష్కారం కనుగొంటమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా తన చెల్లెలు కవిత గెలుపు కోసం కేటీఆర్ రంగంలోకి దిగడానికి అయిన సిద్ధమే అన్నట్టుగా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ స్థానిక ప్రజా ప్రతినిధులతో అన్నట్లు సమాచారం.