హైదరాబాదు, మార్చి 19: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోవడం, జగన్ గెలవడం పక్కాగా జరుగుతాయని మాజీ ఎంపి మోతుకుపల్లి నర్శింహులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోతుందని తాను ముందే చెప్పాని నర్శింహులు అన్నారు.
టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి లేదా టిఆర్ఎస్లో విలీనం చెప్పానని అని చెబితే చంద్రబాబు ఆవేశపడి తననే సస్స్పెండ్ చేశాడని అన్నారు. హరికృష్ణ కూతురును ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చి ఓడగొట్టారని అన్నారు.
చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్ జగన్ మాటపై నిలబడే వ్యక్తి, మొనగాడు అని నర్శింహులు పేర్కొన్నారు.
చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్టిఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. నమ్మినవారికి పంగనామాలు పెట్టడమే చంద్రబాబు పని అని అన్నారు.
చంద్రబాబు ఎవరికి చెప్పకుండా అమరావతికి పారిపోయాడని నర్శింహులు విమర్శించారు. 30సంవత్సరాలు తనను వాడుకుని వదిలివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.
వర్గీకరణ పేరుతో మాల, మాదిగలకు చిచ్చు పెట్టిన చంద్రబాబు కాపులను నమ్మిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సి, బిసిలు మంచి పదవిలో ఉంటే చంద్రబాబుకు అస్సలు నచ్చదని నర్శింహులు అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్తో చంద్రబాబు కలవాలని నర్శింహులు హితవు పలికారు.