జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలలో ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రోద్బలం కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. బిజెపి పార్టీతో పొత్తు ఈ విషయంలో గాని పవన్ కళ్యాణ్ చేపట్టే పర్యటన విషయంలో గాని పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి నాదెండ్ల మనోహర్ కథ మొత్తం నడిపిస్తూ ఉంటారు. అటువంటిది కరోనా వైరస్ వచ్చాక చాలా వరకు ఏపీలో జనసేన పార్టీ కార్యకలాపాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు హైదరాబాద్ కి పరిమితమవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో ఏపీ నూతన బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చాలావరకు బీజేపీ పార్టీలో చంద్రబాబు కి అనుకూలంగా ఉండే నాయకుల పై డేగకన్ను పెట్టి తేడా వస్తే సస్పెండ్ చేసి పారేస్తున్నారు. మరోపక్క వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవడానికి ఏపీ బీజేపీ పావులు కదుపుతు చిరంజీవి కుటుంబాన్ని వాడు కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండే నాదెండ్ల మనోహర్…. గతంలో చంద్రబాబు కి పవన్ కి మధ్య వారధిగా ఉన్నట్లు తెగ ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఇటీవల పవన్ కళ్యాణ్ కి నాదెండ్ల మనోహర్ ని దూరం చేయాలని రెడీ అయినట్లు, నాదెండ్ల మనోహర్ ని పూర్తిగా పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ ని సరైన ట్రాక్ లో నిలబెట్టి నాదెండ్ల మనోహర్ ప్లేస్ లో సోము వీర్రాజు ఉండాలని… ఈ విధమైన రాజకీయం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జనసేన లో నాదెండ్ల మనోహర్ ఉన్నాగాని ఆయనకు అర్థం అవ్వనది అని మేధావులు అంటున్నారు. ఇప్పటికే బిజెపి కంటే ఏపీలో జనసేన పార్టీ చాలావరకు సైలెంట్ అయిపోయిన పరిస్థితి నెలకొంది.
ఇటువంటి తరుణంలో ఏపీ బీజేపీ జనసేన పార్టీ పై ఫుల్ గ్రిప్ సంపాదిస్తే… ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవటం గ్యారెంటీ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు ఒప్పుకోవడంతో…. ఇప్పుడు అప్పుడే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని టాక్ వస్తుంది. దీంతో ప్రస్తుతం ఏపీలో బీజేపీ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న నేపథ్యంలో…. పవన్ కళ్యాణ్ ని పూర్తిగా తన గ్రిప్ లో పెట్టడానికి సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.