వరుసగా రెండుసార్లు భారత్ కి ప్రధాని కావటంతో మోడీ పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగుతోంది. పైగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కొనియాడుతూ ఉంది. మరోపక్క బిజెపి పార్టీ వరుస విజయాలతో బీహార్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రేటర్, దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో బిజెపి గ్రాఫ్ ఉన్న కొద్దీ పెరుగుతుంది అనే టాక్ రాజకీయవర్గాలలో వినబడుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలో మోడీ కంచుకోటగా పిలవబడే వారణాశిలో జరిగిన ఎన్నికలలో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే మోడీ వరుసగా రెండుసార్లు గెలిచిన టువంటి వారణాసి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు సరికొత్త షాక్ ఇచ్చాయి. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఈ రెండింటిలో కూడా కమలం పార్టీ పరాజయం పాలైంది. ఓవరాల్ గా ఉత్తరప్రదేశ్ లో గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 11 స్థానాలకు జరిగాయి.
వీటిలో ఆరు స్థానాలలో బీజేపీ పార్టీ గెలుచుకోగా, రెండు స్థానాలలో సమాజ్వాది పార్టీ.. మిగతాది ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. అయితే మోడీ నియోజకవర్గం వారణాసిలో అటు గ్రాడ్యుయేట్ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన వార్త అయింది. అయితే ఈ రెండు ఎన్నికలలో బిజెపి ని మట్టికరిపించింది సమాజ్ వాది పార్టీ. మొత్తం మీద వారణాసి లో వచ్చిన రిజల్టు బట్టి చూస్తే విద్యావంతుల లో బీజేపీపై వ్యతిరేకత మొదలైంది అనే చర్చ దేశవ్యాప్తంగా వినబడుతోంది.