ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన జిల్లాలలో అనంతపురం జిల్లా ఒకటి. ఈ జిల్లా పేరు చెబితే చాలు చంద్రబాబు కళ్ళలో ఆనందం 1000 వాట్స్ బల్బ్ వెలుగుతున్నట్లు ఉంటుంది. అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో టీడీపీ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ఒక నియోజకవర్గంలో మాత్రం అటు ఇటు గా పార్టీ పరిస్థితి నెలకొంది. ఆ నియోజకవర్గం పేరు కదిరి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి అనంతపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో చాలా వరకు టిడిపి సత్తా చాటిన ఈ నియోజకవర్గంలో మాత్రం మూడు సార్లు మాత్రమే టీడీపీ గెలవడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పార్టీ స్థాపించిన సమయంలో ఆ తర్వాత 1994, 2009లో ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ గెలిచింది. అయితే విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసిపి పార్టీ క్యాండెట్ అక్తర్ చాంద్ బాషా గెలవడం జరిగింది. కానీ కొద్ది నెలల్లోనే టీడీపీలో చేరడం జరిగింది. మొదట మంత్రి పదవి ఇస్తారని పార్టీలోకి తీసుకున్న అక్తర్ చాంద్ బాషా కి తర్వాత విప్ పదవి ఇచ్చి చంద్రబాబు సరిపెట్టారు. మరోపక్క పార్టీ కోసం ఎప్పటినుండో కష్టపడి పని చేస్తున్నా కందికుంట వెంకట ప్రసాద్ అనుచర వర్గానికి చాంద్ బాషా టిడిపిలోకి రావటంతో కదిరి నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపు వర్గాలుగా ఏర్పడ్డాయి. చాంద్ భాషా రాకతో పార్టీలో అనిశ్చితి ఏర్పడింది. రెండు వర్గాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా వాతావరణం నెలకొంది.
ఈలోపు 2019 ఎన్నికల టైంలో రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక తనకు టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు ని భాషా కోరారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన కందికుంటకే టికెట్ కేటాయించడం జరిగింది. స్వల్ప తేడాతో వైసిపి పార్టీ క్యాండెట్ వెంకట సిద్ధారెడ్డి పై ఓడిపోయారు కందికుంట. ఇదే టైమ్ లో ఓడిపోయినా గాని ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ పుంజుకోవటం కోసం కందికుంట గతంలో పార్టీకి దూరమైన కార్యకర్తలను దగ్గరకి చేర్చుకోవడానికి మంతనాలు జరుపుతున్నారట. నియోజకవర్గంలో తేలిపోయిన టిడిపి క్యాడర్ ఏకం చేయడానికి కందికుంట అడుగులు వేస్తున్నారు అట. ఈ విధంగా టీడీపీ పార్టీకి దూరమైన కార్యకర్తలను తిరిగి పార్టీలో యాక్టివ్ చేయడానికి సరికొత్త వెరైటీ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆరంభించ బోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది .