నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధులు. ఇష్టానుసారంగా పార్టీకి వ్యతిరేకంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించడంతో ఆయన దూకుడుకి షోకాజ్ నోటీసులతో కౌంటర్లు స్టార్ట్ చేసిన వైసీపీ.. వరుసగా ఆయనపై పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే మంత్రి రంగనాథ రాజు తన పరువు భంగం కలిగించే విధంగా రఘురామకృష్ణంరాజు కామెంటు చేశారని….పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే.
దీనిపై కంగారు పడిపోయిన రఘురామకృష్ణంరాజు కి ఇప్పుడు తాజాగా అదే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ల మీద షాక్ లు ఇస్తు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఇద్దరూ నర్సాపురం ఎంపీ పై పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది. తమపై రఘురామకృష్ణంరాజు తప్పుడు ఆరోపణలు చేశారని, తమ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశారు. మరోపక్క రఘురామకృష్ణంరాజు కూడా వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేయడానికి రెడీ అయ్యారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్ అయింది.