చంద్రబాబుకి నమ్మినబంటుగా అచ్చెన్నాయుడు కి మంచి పేరు ఉంది. అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. చంద్రబాబుని ఓ రేంజ్ లో పొగిడేవారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందిన కానీ అసెంబ్లీలో చంద్రబాబు ని డిమాండ్ చేస్తూ అచ్చెన్నాయుడు కీలకంగా రాణిస్తూ వచ్చేవారు. కాగా ఈఎస్ఐ స్కామ్ వ్యవహారంలో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
చాలా నెలల తర్వాత ఇటీవల ఎన్నో ప్రయత్నాలు చేయగా బెయిల్ రావడం జరిగింది. దీంతో జైలు నుండి బయటకు రావడంతో అచ్చెన్నాయుడు ఇక వైసీపీపై చెలరేగి పోతారని అందరూ భావించారు. కానీ బయట పరిస్థితి చూస్తే దానికి విరుద్ధంగా అచ్చెన్నాయుడు చాలా సైలెంట్ అయిపోయారు. సొంత నియోజకవర్గానికి పరిమితమైపోయి ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడానికి సాహసం కూడా చేయటం లేదు. దీంతో అచ్చెన్నాయుడు వ్యవహారం టిడిపి పార్టీలో లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఇలాంటి తరుణంలో త్వరలోనే అచ్చెంనాయుడుకి టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు రెడీ అయినట్లు ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు కూడా టాక్. అయినా గాని అధ్యక్షపదవి వచ్చినా గాని వైసీపీ ప్రభుత్వం పై అచ్చెన్నాయుడు ఏమాత్రం దూకుడుగా వెళ్ళకూడదని ఫుల్ గా డిసైడ్ అయినట్లు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో వినబడుతున్న టాక్.
దీంతో అధ్యక్ష పదవి ఇచ్చినా గాని అచ్చెన్నాయుడు సైలెంట్ అయ్యారు రీతిలో వ్యవహరించటం అనే వార్తలు రావడం ఖచ్చితంగా ఇది చంద్రబాబుకి నమ్మలేని న్యూస్ అని పరిశీలకులు అంటున్నారు. అంత సైలెంట్ గా ఉండటం వల్ల అధ్యక్ష పదవి ఇచ్చిన అది … బూడిదలో పోసిన పన్నీరు అన్నట్టు మారుతుందని, ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీలో గ్రూపు రాజకీయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.