వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న నాటినుండి ట్విట్టర్ లో ఎప్పుడూ టిడిపిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. మొదటిలో విజయసాయిరెడ్డిని చాలా లైట్ తీసుకున్న టిడిపి ఆయన చేస్తున్న కామెంట్లు చాలావరకు ప్రజలలోకి వెళ్తున్నట్లు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గుర్తించిందట.
అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన ట్వీట్లు చాలా వరకు ప్రజలను ప్రభావితం చేస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డిని అదుపులో పెట్టడం కోసం టిడిపి పార్టీకి చెందిన ఫైర్ లీడర్లు బుద్ధ వెంకన్న, అయ్యన్నపాత్రుడు ని చంద్రబాబు తాజాగా రంగంలోకి దింపారు అని టిడిపి పార్టీలో టాక్. గతంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఏదైనా కామెంట్ చేస్తే దేవినేని ఉమా, వర్ల రామయ్య కౌంటర్లు ఇచ్చేవారు.
అయినా గాని వీరు వేసే కౌంటర్లు పెద్దగా ఆసక్తిగా లేవని చంద్రబాబు గుర్తించి…. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఉత్తరాంధ్ర టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుని రంగంలోకి దింపిన నాటి నుంచి ప్రస్తుతం వీరిద్దరి చేత విజయసాయి రెడ్డికి వేస్తున్న కౌంటర్లు చాలావరకు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఎప్పుడూ ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కామెంట్ పెడితే అప్పుడు వీరిద్దరూ ఘాటైన రిప్లై ఇస్తూ చేస్తున్న రివర్స్ ఎటాక్ చాలావరకు ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల టిడిపి వర్గాలు భావించాయి.
విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లు చాలావరకు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో….. కౌంటర్ కూడా అదేరీతిలో టిడిపి ఇస్తున్నట్లు ఏపీ మీడియా వర్గాలలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తంమీద విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా కట్టడి చేయడం కోసం… అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న ని ఉపయోగించుకోవడం వల్ల చాలా వరకు పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినట్లు టిడిపి నేతలు భావిస్తున్నారు.