వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పుష్ప శ్రీవాణి వ్యవహారం ప్రస్తుతం వైసీపీ పార్టీలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతి చిన్న వయసులోనే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుష్ప శ్రీవాణికి ఏపి డిప్యూటీ సీఎం పదవిని వైయస్ జగన్ కట్టబెట్టటం జరిగింది. దీంతో ఉత్తరాంధ్రలో తల పండిపోయిన రాజకీయ నేతలతో సమానంగా మంచి గౌరవం పుష్ప శ్రీవాణి దక్కించుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కి మరో చెల్లెలుగా పుష్ప శ్రీవాణి పార్టీలో ముందు నుండి రాణించండం జరిగింది. జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టిడిపి ఎన్ని సార్లు పెట్టిన పార్టీ మారలేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని జగన్ నమ్మకాన్ని సంపాదించింది.
దీంతో మంత్రి అయ్యాక టిక్ టాక్ యాప్ లో కూడా అనేక రకాలుగా జగన్ పై తన అభిమానం చాటుతూ వీడియోలు చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చిన తిప్పికొట్టడం లో ముందుండే పుష్ప శ్రీవాణి పార్టీలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు సంపాదించింది. అటువంటి ఈ లేడీ ఏపీ మినిస్టర్ తాజాగా నోరు విప్పకుండా….. చాలా సైలెంట్ గా ఉండటం పెద్ద హాట్ టాపిక్ అయింది.
ప్రభుత్వంపై అదేవిధంగా ముఖ్యమంత్రిపై ఎన్ని విమర్శలు వస్తున్నా గతంలో మాదిరిగా పుష్ప శ్రీవాణి ఎలాంటి కౌంటర్లు ఇవ్వకుండా నాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో కొంతమంది వైసీపీ లో ఉండే సీనియర్ నాయకులు పుష్పశ్రీవాణి ఎదుగుదలను అడ్డుకుంటున్నట్లు, దీంతో ఆమె అలిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద లేడీ ఏపీ మినిస్టర్ పుష్ప శ్రీవాణి ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.