Ys Jagan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఎంట్రీ వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. తర్వాత..దేశంలో ప్రజలు క్రమక్రమంగా పెద్దగా పట్టించుకోకపోవడంతో.. పాటు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించడంతో.. ఇండియాలో చాలా మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక.. ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ముఖ్యంగా కరోనా చికిత్స లో ప్రధానమైన ఆక్సిజన్ కొరత భారతదేశంలో అధికంగా ఉండటంతో.. ప్రాణాలు పోతున్న పరిస్థితి.
దీంతో ప్రపంచంలో మిగతా దేశాలు ఇండియాలో పరిస్థితి అర్థం చేసుకుని ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి.. ముందుకు వస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా.. దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా బారినపడిన వారికి ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి భారీగా ఆక్సిజన్ సిలిండర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సరిపడ్డ సిలిండర్ లతోపాటు.. ఇతర రాష్ట్రాల అవసరతలు కూడా తీర్చే రీతిలో జగన్ సర్కార్ కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం దాదాపు 2700 టన్నుల వరకు… ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, కానీ కొన్ని టెక్నికల్ మరియు అంతర్జాతీయ న్యాయస్థానాల వివాదాల వల్ల.. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం లేని పరిస్థితి.
దీంతో ఈ విషయంపై తాజాగా జగన్ దృష్టి పెట్టినట్లు… అడ్డంకులు మొత్తం తొలగించి రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి 2700 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయ్యేలా.. హై టెక్నికల్ అధికారులతో మరియు కొంత మంది ప్రముఖులతో జగన్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే వివాదాలు తొలగిపోతే దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాణాలను భారీగా కాపాడే రీతిలో జగన్ ఐడియా వర్కౌట్ అవుతుందని.. ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యంత్రాంగమంతా సిద్ధంగా ఉన్నా గానీ కోర్టు వివాదాల వల్ల.. ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేకపోవడంతో.. ఎట్లాగైనా వివాదాలను పరిష్కరించే రీతిలో.. జగన్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో మరో రెండు ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయింది. గుంటూరు ఆటోనగర్ లో సావర్జిన్ ఆక్సిజన్.. అదేవిధంగా అనంతపురం జిల్లాలో సింగనమల మండలం చక్రాయపేట లో లైఫ్ ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆక్సిజన్ కొరత లేకుండా ముందుగానే ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఈ విధంగా ఒక పక్క రాష్ట్రం మరో పక్క దేశంలో ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కూడా కాపాడే విధంగా జగన్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరత విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది.