JAGAN : స్థానిక ఎన్నికలలో గ్రామాలలో తిరుగులేని పార్టీగా వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలవటం అందరికీ తెలిసిందే. కనీసం ప్రచారానికి రాకుండా, తనకి ఓటు వేయండి అంటూ జగన్ ఏ మాత్రం మీడియా సమావేశాలు పెట్టకుండా ..చాలా ధీమాగా ఎన్నికలలో గెలవడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా వైసిపి వెలిగిపోతూ ఉంది. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం చెబుతోంది. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ గ్రామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మేటర్ లోకి వెళితే గ్రామాలలో ఉండే ప్రజల ఆరోగ్యం విషయంలో సరైన వైద్యం కల్పించటానికి, కీలకమైన వ్యాధులు తొలిదశలోనే గుర్తించే విధంగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైయస్సార్ గ్రామీణ క్లినిక్ లు ఏర్పాటు చేయడానికి పూనుకున్న ప్రభుత్వం త్వరలోనే అనగా జూన్ నెలాఖరు కల్లా .. క్లినిక్ లకి సంబంధించిన భవనాలను కట్టడానికి లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం 1443 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని, దాదాపు 8585 వైయస్సార్ క్లినిక్ లు అందుబాటులోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయింది.
అంతేకాకుండా ఒక్కో మండలంలో రెండు పీహెచ్ సీలు, నలుగురు వైద్యులు ప్రతి పీహెచ్ సీకి ఉండే విధంగా ఒక డాక్టర్ తో కూడిన అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైయస్సార్ క్లినిక్ విధానం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామంలో తీసుకువచ్చే ఆలోచనలో జగన్ వైద్య అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్. దీంతో ప్రాథమిక దశలోనే కీలకమైన జబ్బును గుర్తించి ప్రజలకు మేలు చేసే తరహా విధంగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.