ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల సర్వేకు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే ప్రారంభించి 2023 నాటికి పూర్తిగా భూ సర్వే ముగించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో భూ వివాదల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో భూవివాదాలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యే రీతిలో వైయస్ జగన్ ప్రభుత్వం సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టనున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.
అదే రీతిలో గ్రామసభల ద్వారా భూ సర్వే పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వినూత్న కార్యక్రమాలు కూడా జగన్ సర్కార్ చేపట్టబోతున్నాట్లు టాక్. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్ళు ఏర్పాటు చేయడంతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. భూ సర్వే పైలెట్ ప్రాజెక్టు కింద ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లకు రంగం సిద్ధం చేశారు.
3 విడుతలలో ఈ సమగ్ర భూ సర్వే చేపట్టాలని సీఎం జగన్ గతంలోనే అధికారులకు సూచించడం జరిగింది. మండలాల వారీగా పొందాలని ఏర్పాటు చేసిన సర్వే చేపట్టాలని అధికారులకు జగన్ సూచించడం జరిగింది. అదేవిధంగా సర్వే చేపట్టి సమగ్ర విచారణ డిజిటల్ రూపంలో అత్యాధునిక టెక్నాలజీతో భద్రపరుస్తామని, ఎవరు తారుమారు చేయకుండా రెండు మూడు చోట్ల భద్రపరుస్తామని వైఎస్ జగన్ కి అధికారులు తెలియజేశారు. ఏది ఏమైనా ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని, అధికారులంతా చాలా సీరియస్ గా తీసుకుని, ఏదైనా వివాదాలు నెలకొంటే పరిష్కరించుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయాలని జగన్ అధికారులకు సూచించారు.