వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నట్లు టిడిపి నాయకులు తెగ గగ్గోలు పెడుతున్నారు. వరుసగా రెండు శిరోముండనం ఘటనలు జరగటంతో చంద్రబాబు కూడా… ఇది దళిత ద్రోహి ప్రభుత్వమని కామెంట్ చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసిపి నాయకులు చంద్రబాబుపై దళితులపై దాడుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేయాలన్నదే చంద్రబాబు కుట్ర అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు. అందుకే దళితులపై దాడులను చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా టీడీపీ వైఖరిని నిరసిస్తూ శ్రీకాకుళం లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, నివాళులు అర్పించారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. అదేవిధంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులు మీకెందుకు పదవులు, రాజకీయాలు అని అప్పట్లో మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసలు దళితులు లాగా ఎవరైనా పుట్టాలి అని అనుకుంటారా? అని అప్పట్లో కామెంట్లు చేశారు. టిడిపి హయాంలో దళితులకు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఎన్నో అన్యాయాలు జరిగాయని పేర్కొన్నారు. అలాంటి వారు ఇప్పుడు దళితులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోంది అని చెప్పటం హాస్యాస్పదం అన్నట్టుగా ఎమ్మెల్యే ఉద్యోగులు మీడియాతో మాట్లాడటం జరిగింది.