YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు, సిట్టింగ్ ల మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దమవుతున్నారు.
ఈ నెల 25వ తేదీ నుండి రీజనల్ క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ ..మరో రెండు మూడు జాబితాలను విడుదల చేసి ఆ తర్వాత పార్టీ రీజనల్ మీటింగ్ లను ఏర్పాటు చేయనున్నారు.
తొలుత సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన అయిదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నాలుగు నుండి అయిదు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్