హైదరాబాద్ సెలబ్రిటీ క్లబ్ లో జరిగిన కాల్పుల కలకలం కేసులో సీరియల్ నటుడు మనోజ్ కుమార్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తన పిల్లలను హింసిస్తున్నాడని అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మనోజ్ కాల్పులు జరిపాడని సిద్ధార్ధ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. నటుడు మనోజ్ తో సిదార్ధ్ భార్య తన పిల్లలతో లివింగ్ రిలేషన్ ఫిప్ లో ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను చూసేందుకు సిద్ధార్ధ్ తరచు సెలబ్రిటీ రిసార్ట్ లోని మనోజ్ విల్లాకు వచ్చి వెళుతున్నాడు. ఇవేళ మనోజ్ విల్లాకు సిద్దార్ధ్ వచ్చిన సమయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.
ఈ నేపథ్యంలో సిద్దార్ద్ పై మనోజ్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో సిద్దార్ధ్ కు గాయాలు కాలేదు. అయితే మరో పక్క మనోజ్ పై సిద్ధార్ధ్ కుమారుడు ఫిర్యాదు చేశారు. మనోజ్ చిత్రహింసలు పెట్టాడని సిద్ధార్ధ్ కుమారుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధార్ధ్ కుమారుడు ఉన్నాడు. తన కుమార్తెను చూడటానికి వెళ్లడంతో మనోజ్ కాల్పులకు పాల్పడ్డాడని సిద్ధార్ద్ చెబుతున్నాడు. ఇటు కాల్పుల కేసుతో పాటు చైల్డ్ వెల్పేర్ కమిటీ కేసులో నటుడు మనోజ్ కుమార్ ఇరుక్కున్నారు.
సెలబ్రిటీ క్లబ్ లో కాల్పుల కలకలం .. కార్తీక దీపం సీరియల్ నటుడుపై కేసు నమోదు