Big Breaking: తెలుగు రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం హూజూరాబాద్, ఏపిలోని బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు , ఫలితాల వెల్లడి. ఈ ఉప ఎన్నికలకు అక్టోబర్ 1వ తేదీన నోటిపికేషన్ విడుదల చేయనున్నారు.
కరీంనగర్ జిల్లా హూజారాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా కారణంగా ఉప ఎన్నిక జరుగుతున్నది. ఇక బద్వేల్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో మృతి చెందారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాకమునుపే హుజూరాబాద్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించింది. ఇక ఏపిలోని బద్వెల్ ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ పేరునే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది, ఇక హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడి కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.