Breaking: చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఫ్లాట్ ఫాంపైకి చేరుకునే సమయంలో సైడ్ వాల్ ను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తొంది. దీంతో ఒక్క సారిగా రైలు కుదుపునకు లోనైంది. స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో ..సుమారు 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. మూడు బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణీకులు గాయపడ్డారు.
క్షతగాత్రులను లాలాగూడ లోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే స్టేషన్ లో కాకుండా మరెక్కడైనా పట్టాలు తప్పి ఉంటే పెను ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.