హైదరాబాద్ నగరంలో మరో సారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లిహిల్స్, మణికొండ, పంజాగుట్ట లో ఉదయం నుండే ఈడీ దాడులు జరుపుతోంది. మాజీ పార్లమెంట్ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఈడీ హైదరాబాద్ విభాగం సోదాలు నిర్వహిస్తొంది. ట్రాన్స్ ట్రాయ్ పవర్ ప్రాజెక్టు డైరెక్టర్ మాలినేని సాంబశివరావుకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్టు, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్టులకు ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా, 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుండి ట్రాన్స్ ట్రాయయ్ సింగపూర్ లిమిటెడ్ కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్లుగా ఈడీ అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ.300 కోట్లు రుణాలు పొందగా, తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. రూ,260 కోట్లు ఇతర కంపెనీకి మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. రుణంగా తీసుకున్న డబ్బులను బంగారం, వెండి అభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది.
Ongole(prakasam): ఏసీబీకి చిక్కిన మరో ఎస్ఐ