హైదరాబాద్ టీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గత మూడు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరో పక్క సీబీఐ అదుపులో రామ్మోహన్ ఉన్నడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులో బొందు రామ్మోహన్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ కేసులోనే మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్రలకు సీబీఐ నోటీసులు అందజేయడంతో బొందు రామ్మోహన్ ను కూడా ఈ కేసులో విచారణ చేయడానికి అదుపులోకి తీసుకువెళ్లారని పుకార్లు వచ్చాయి. అయితే ఇది వాస్తవం కాదని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో బొందు రామ్మోహన్ పై అసత్యప్రచారం సెర్క్యులేట్ అవుతోందని అంటున్నారు. సీబీఐ అదుపులో ఉన్నారనేది వాస్తవం కాదని అంటున్నారు. కాగా సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల కమలాకర్, వద్దిరాజు రవి చంద్రలు ఈ రోజు విచారణకు హజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఫేక్ సీబీఐ అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా తనపై జరుగుతున్న ప్రచారంపై బొంతు రామ్మోహన్ వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నాననీ, తనను ఎవరూ అరెస్టు చేయలేదని చెప్పారు. తనకు ఇంత వరకూ ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. ఒక టీసులు జారీ చేస్తే విచారణకు హజరు అవుతానని తెలిపారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.