Hyderabad Gang Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో అయిదుగురు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న ఏ -1 సాదుద్దీన్ ను విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన అయిదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు గానూ హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయిదుగురు మైనర్ నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు కోరారు. ఈ మేరకు 2015 జూవైనల్ జస్టిస్ యాక్ట్ కు చేసిన చట్ట సవరణలను పోలీసులు గుర్తు చేస్తున్నారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్ గా పరిగణించవచ్చని చెబుతున్నారు. చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన 17 ఏళ్ల మైనర్ బాలుడికి మూడేళ్ల క్రితం జూవైనల్ కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించినట్లు వెల్లడిస్తున్న పోలీసులు.. జూబ్లీహిల్స్ ఘటనలోనూ నిందితులు నేరం గురించి తెలిసే అత్యాచారం చేశారని భావిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Hyderabad Gang Rape Case: వారిని మేజర్ లుగా పరిగణించాలి
ఈ నిందితులపై సెక్షన్ ను పూర్తిగా అమలు చేసేందుకు మేజర్లుగా పరిగణించాల్సి ఉంటుందని జూవైనల్ బోర్డుకు పోలీసులు తెలియజేశారు. చార్జిషీట్ దాఖలు చేసే సమయానికి నిందితులు అందరూ మేజర్లు అవుతారని పేర్కొన్న పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే పోలీసుల విజ్ఞప్తి పై జూవైనల్ జస్టిస్ దే తుది నిర్ణయం. మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకని జువైనల్ జస్టిస్ నిర్ణయాన్ని తెలియజేయనుంది. సాధారణంగా జూవైనల్ హోమ్ లో ఉన్న మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని సాధారణ జైల్ కు తరలిస్తారు. ఇప్పటికే ఏ 1 సాదుద్దీన్ ను కస్టడీకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజులు విచారించనున్నారు. అదే విధంగా జూవైనల్ హోమ్ లో ఉన్న అయిదుగురు నిందితులను సైతం కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టు అనుమతి తీసుకోనున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై బీజేపీతో సహా పలువురు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరణంలో పోలీసు అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న కీలక నిర్ణయాన్ని మంత్రి కేటిఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్ గా పరిగణించకుండా కచ్చితంగా మేజర్లుగానే శిక్షించాలని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కేటిఆర్. “అత్యాచారం నేరానికి పాల్పడేంత పెద్దవారతే.. ఆ వ్యక్తిని కూడా పెద్దవారిగానే శిక్షించాలి ..యువకుడిగా కాదు” అని కేసిఆర్ పేర్కొన్నారు.
I welcome & support the stand of @TelanganaCOPs
If you are adult enough to commit a crime as heinous as rape, one must also be punished as an adult
& not as a juvenile https://t.co/Pp3ALBzbfx— KTR (@KTRTRS) June 9, 2022