మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం చత్తీస్ గఢ్ దండకారణ్యంలో గుండె పోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ నాలుగు దశాబ్దాల క్రితం ఉద్యమంలోకి వెళ్లారు.
మవోయిస్టులో అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పని చేసిన కటకం సుదర్సన్ .. ప్రస్తుతం బస్తర్ మవోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. గెరిల్లా వార్ లో మంచి దిట్టగా పేరుపొందారు. జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకూ సుదర్శన్ సంస్మరణ సభలు నిర్వహించాలి మావోయిస్టులకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
Kakinada: గుడిలోకి దూసుకువెళ్లిన లారీ .. ముగ్గురు మృతి