Tragedy: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండె పోటుతో మృతి చెందారు. విష్ణువర్ధన్ రెడ్డి గత కొద్ది రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గురువారం వేకువ జామున గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన మృతి చెందారు. కిడ్నీలు పాడవ్వడంతో విష్ణువర్ధన్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డికి డయాలసిస్ చేశసారు. గత కొద్ది రోజులుగా విష్ణువర్థన్ రెడ్డి వెంటిలేటర్ పై ఉన్నారు.
ఈ క్రమంలోనే తెల్లవారుజామున గుండె పోటు వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని ఉదయం ఆసుపత్రి నుండి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసానికి తరలించారు. కుమారుడు మృతితో మహిపాల్ రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంల మునిగిపోయింది. విష్ణువర్థన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. మహిపాల్ రెడ్డి పటాన్ చెరు నుండి రెండు సార్లు అధికార బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. ఎమ్మెల్యే కుమారుడి మృతితో నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విష్ణువర్థన్ రెడ్డికి బార్య కిరణ్మయితో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
Tirupati: శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అపశృతి .. ఇద్దరు కార్మికులు మృతి