Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అయిదవ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో పలు ఆసక్తికరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాదయాత్రలో రాహుల్ గాంధీ తో కలిసి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉత్సహాంగా పాల్గొంటున్నారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ అకస్మాత్తుగా గేర్ మార్చి కొద్ది దూరం పరుగు (రన్నింగ్) లంకించడంతో ఆయన భద్రతా సిబ్బంది, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు ఆయనను అనుసరించారు. రాహుల్ నేతలతో కలిసి రన్నింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంలో వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, సాధారణ ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణలోని మార్గమధ్యలో ఉన్నప్రముఖ ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను రాహుల్ సందర్శించి ప్రార్ధనలు చేస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. పాదయాత్ర విరామ సమయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ ల తీరుపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాగా రాహుల్ పాదయాత్రలో ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ తో కలిసి కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరపతి అనిల్, ఆలిండియా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు కాండగట్ల స్వామి, నాయకులు పద్మ గజం అంజయ్యతో కలిసి చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం వేసిన అయిదు శాతం జీఎస్టీ ఎత్తివేయాలని, నేతకు సంబంధించి ముడి సరకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు పార్లమెంట్ లో మాట్లాడాలని కోరగా, రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు పూనమ్ కౌర్ మీడియాకు తెలిపారు,
‘Fit’ness for Bharat Jodo…#ManaTelanganaManaRahul #BharatJodoYatra #Day5 pic.twitter.com/3tX4EJ5ByG
— Revanth Reddy (@revanth_anumula) October 30, 2022